ఏపీలో దారుణం..బాలికపై వాలంటీర్‌ అత్యాచారం

-

మన దేశంలో రోజు రోజుకు మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరించినా.. చట్టాలు తీసుకువచ్చినా… మహిళలపై దాడులు ఆగడం లేదు. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకులం జిల్లాలో ఓ వాలంటీర్‌ దుర్మార్గానికి తెర లేపాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే బాలిక పై వాలంటీర్‌ లైంగిక దాడి చేశాడు.

ఈ దారుణమైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని. వీరఘట్టం మండలం నడుకూరు లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ విషయం బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలియ జేసింది. దీంతో ఆ బాధితురాలి తల్లిదండ్రులు… స్థానిక పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేసారు. దీంతో ఈ ఘటనకు కారకుడైన వాలంటీర్‌ మరియు సహాయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు పరారీ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news