ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలి : మంత్రి అచ్చెన్నాయుడు

-

ఏపీలో ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఖరీఫ్ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.

మిగిలిన ఎరువులు సకాలంలో రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 1,321సహకార సంఘాల్లో రైతులకు విక్రయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. మిగిలిన లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేసి ఎరువుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news