గత జన్మలో పుణ్యం చేసి ఉంటా.. రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ తో ఈమె బద్రి, జానీ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరానందన్, ఆద్య అనే ఇద్దరూ పిల్లలు పుట్టారు. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. పవన్ తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ కి గట్టిగానే సమాధానం చెబుతుంది రేణు దేశాయ్.

ఇదిలా ఉంటే.. నిత్యం  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మూగ జీవాలకు లేదా తన పిల్లలకు సంబంధించిన ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ రేణూ దేశాయ్ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన పిల్లలకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. తన మీద కూతురు ఆద్య రాసిన పోయమ్ ని షేర్ చేస్తూ.. ‘నన్ను నా పిల్లలు కవితగా మార్చారు. గత జన్మలో ఇప్పుడు నేను ఎన్నో పుణ్యాలు చేసి ఉంటా.. అందుకే నాకు అకీరా, ఆద్య లభించారు’ అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version