నా కెరీర్‌ ఒక మరపురాని ప్రయాణం : అల్లు అర్జున్‌

-

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో బన్నీ మేనరిజం ఫ్యాన్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ ఈ విషయంపై ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్‌ చేశారు.

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ.. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే రిలీజ్ అయింది.ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా అని అన్నారు. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను అని పేర్కొన్నారు. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news