రెచ్చిపోయిన రియాన్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే..? 

-

ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 185 పరుగులు చేసింది. కేవలం 9 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 30 పరుగుల వద్ద సంజు శాంసన్ (15)ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక తరువాత 36 పరుగుల వద్ద జోస్ బట్లర్ (15) కుల్దీప్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఇక ఆ తరువాత రియాన్ పరాగ్, రవీచంద్రన్ అశ్విన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ స్కోర్ బోర్డును పెద్దగా పరుగులు పెట్టించలేకపోయారు. అశ్విన్ (29) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వికెట్లు పోతున్న సమయంలో రియాన్ పరాగ్ (84 నాటౌట్)రెచ్చిపోయాడు. 18 ఓవర్ లో కాస్త మంచిగా ఆడుతున్నాడుకున్న సమయంలోనే దృవ్ జురెల్ బ్యాట్ వికెట్లకు తాకి ఔట్ అయ్యాడు. చివరి ఓవర్ లో 446462 పరుగులు బాదాడు రియాన్ పరాగ్. దీంతో రాజస్థాన్ 185 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 186 పరుగులు చేయాలి. ఢిల్లీ ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news