MAA ELELCTIONS : బాలకృష్ణ పై నాగబాబు షాకింగ్ కామెంట్స్ !

-

నందమూరి బాలకృష్ణ ఇటీవల వ్యాఖ్యల పై నటుడు నాగబాబు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని… భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారని.. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కోసం ఒకప్పటి అధ్యక్షుడు మురళీమోహన్‌ ఎంతో ప్రయత్నించారని గుర్తు చేశారు.

రాజకీయ కారణాల వల్ల అది సఫలం కాలేదని.. ఆయన తర్వాత వచ్చినవాళ్లు కూడా ఎన్నో సార్లు ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాలనుకున్నారని తెలిపారు నాగబాబు. భవన నిర్మాణం, నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్‌ ఉందని చెప్పారు. ‘మా’ అసోసియేషన్‌ వృద్ధికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేదానిపై ఆయనకు ప్లానింగ్‌ ఉందని… అందుకే తాను ఆయనకు సపోర్ట్‌ చేస్తున్నానని ప్రకటించారు. ‘‘మా’ కోసం ఇప్పటివరకూ కొంతమంది అధ్యక్షులు విరాళాలు సేకరించిన మాట వాస్తవమేన్నారు.

అవి ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం సేకరించారని… ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటున్న మంచు విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు నాగబాబు. ఒకవేళ ఏకగ్రీవం చేయాలనుకుంటే.. పోటీలో నిలబడిన వాళ్లందరూ తప్పుకుని ప్రకాశ్‌రాజ్‌ని అధ్యక్షుడిని చేయవచ్చు కదా ? అని చురకలు అంటించారు. తన దృష్టిలో ఏకగ్రీవం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని… ఏ అంశంలోనైనా పోటీ ఉండాలి.. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ అయి ఉండాలన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అందరూ కలిసి పనిచేస్తే… మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news