నల్గొండ: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణం… బాత్రూం లోనే ప్రసవం !

-

తెలంగాణాలో తాజాగా జరిగిన ఒక ఘటన ప్రభుత్వాన్ని తలదించుకునేలా చేసిందని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం నల్గొండ జిల్లా కేంద్రం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు మూడు రోజుల ముందు నిండు చూలాలుగా ప్రసవం కోసం ఒక మహిళ అడ్మిట్ అయిందట. అయితే ఆ గర్భిణీ మాత్రం అడ్మిట్ అయిన రోజు నుండి రూమ్ లోనే ఉంది.. కానీ ఏ డాక్టర్ కూడా ఆమెను చూడడానికి రాలేదు. అయితే ఆ తర్వాత ఆమెను పరీక్షించిన డాక్టర్ లు మొదట ప్రసవం ఎలా అయిందని కనుక్కున్నారట.

అప్పుడు ఆ గర్భిణి తో వచ్చిన వారితో మొదటిది ఎలాగు మాములు డెలివరీ అయింది కాబట్టి రెండవది కూడా నార్మల్ డెలివరీ అవుతుంది, అందుకు సరిగ్గా వారం రోజులు సమయం పడుతుంది అని నమ్మించి ఇంటికి వెళ్లామన్నారు. ఈ విషయం చెప్పి అలా వెళ్లిన డాక్టర్లకు ఆ గర్భిణీ షాక్ ఇచ్చింది. కొన్ని నిముషాల్లోనే ఆమె బాత్రూం లో ప్రసవించింది. ఒక డాక్టర్ గా ఉండి సరైన సమాచారం ఇవ్వకుండా ఆమెకు డెలివరీ చేయకుండా బాత్రూం లోనే ప్రసవం అయ్యేలా చేశారు. ఇది తెలిసిన వారు ఎంత దారుణంగా జరిగింది అంటూ డాక్టర్ల పైన దుమ్మెత్తి పోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news