తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలి : నామా నాగేశ్వరరావు

-

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. అఖిల పక్ష భేటీ అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతు.. కేంద్ర ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పామన్నారు. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశామని.. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు.

ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారని.. చివరికి చేతులు ఎత్తేసి.. ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారని వెల్లడించారు. యాసంగి పంట కొనేదిలేదని చెప్పారు. ఖరీఫ్ లో పండిన ధాన్యం ఎంత కొనేది కూడా చెప్పం అని అంటున్నారని.. అఖిల పక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

ఈ అంశాలను పార్లమెంట్ లో లెవనెత్తుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. వ్యవసాయ బిల్లులు రద్దు తో పాటు “కనీస మద్దతు ధర”కు చట్ట బద్ధత, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశామని వెల్లడించారు. .రైతులపై నమోదైన కేసులు ఎత్తేయాలని.. మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షలు ఇచ్చారన్నారు. ఉద్యమ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం కూడా ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news