“లైగర్” టీం ను సర్ ఫ్రైజ్ చేసిన బాలయ్య

-

హీరో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “లైగర్”. బాక్సింగ్‌ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్‌ పనిలో పడింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెట్‌ కి వచ్చారు హీరో బాలయ్య బాబు. లైగర్‌ సెట్‌ కు వచ్చి… ఆ చిత్ర బృందానికి సడెన్‌ సర్‌ ఫ్రైజ్‌ ఇచ్చారు బాలయ్య. అంతేకాదు… చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ కూడా చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news