హాస్పిటల్ డీన్ తో టాయిలెట్ క్లీన్ చేయించిన శివసేన ఎంపీ !

-

ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ హాస్పిటల్ లో 31 మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ హాస్పిటల్ ను సందర్శించి టాయిలెట్ లు సరిగా లేకపోవడాన్ని గమనించి సీరియస్ అయ్యి, హాస్పిటల్ డీన్ తో టాయిలెట్స్ ను క్లీన్ చేయించాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ ఘటనను పూర్తిగా ఖండించారు. డీన్ తో టాయిలెట్ క్లీన్ చేయించడం ఏమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఈ ఎంపీ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం కు లేఖ రాసింది. ఇక హాస్పిటల్ డీన్ సైతం నాకు పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా MP SC ST అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక తదుపరి ఈ కేసు విషయం ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.

ఎంపీ ప్రజలకు నష్టం కలిగిందన్న ఉద్దేశ్యంతోనే డీన్ ను అలా చేయించారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నది కొందరి అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news