అమరావతి రైతులుగా చెప్పుకుంటున్న వారు చంద్రబాబు బినామీలే : ఎంపీ నందిగం సురేష్

-

టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారని.. ప్రజలు వీళ్ళను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయని.. జగన్ ఓటు పులివెందులలో ఉందని తెలిపారు.

బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

పాదయాత్ర లో పాల్గొన్న వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ బాధ్యత చంద్రబాబుదేనని.. అమరావతి రైతులుగా చెప్పుకుంటున్న వారు చంద్రబాబు బినామీలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపి నందిగం సురేష్.. చంద్రబాబు రాష్ట్ర ప్రజల పై నాగుపాములా పగబట్టాడని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు బానిసత్వం వహిస్తున్నాడని అగ్రహించారు వైసీపీ ఎంపి నందిగం సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news