YSR పంచె దారపు పోగును కూడా పవన్‌ టచ్‌ చేయలేదు -పేర్నినాని

-

 

 

 

YSR పంచె దారపు పోగును కూడా పవన్‌ టచ్‌ చేయలేడని చురకలు అంటించారు పేర్నినాని. నిన్న శ్రీకాకుళం లో నిర్వహించిన రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు అయిన రోజా, గుడివాడ అమర్నాథ్ మరియు అంబటి రాంబాబు లను టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.

 

వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఆ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు చంకనెక్కబోతున్నానని పవన్‌ చెబుతున్నాడు.. ఇవాళ్టితో పవన్‌ ముసుగు తొలగిపోయింది.. 2009లో పంచె ఊడదీస్తానని, 2014 దాకా పత్తా లేడనీ విమర్శలు చేశారు. రాజశేఖరరెడ్డి పంచె ఊడగొట్టాడా??రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని ఆపగలిగాడా??రాజశేఖరరెడ్డి పంచె పోగు అయినా టచ్ చేయగలిగాడా?? అని ప్రశ్నించారు.2009 నుంచి 2014 వరకు అడ్రస్ లేకుండా పోలేదా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news