ఏపీలో ఆల‌య ధ్వంసం..నారా లోకేష్ ఫైర్..!

-

రోడ్డు విస్తర‌ణ‌లో భాగంగా పాత‌ప‌ట్నంలోని నీల‌మ‌ణి దుర్గ అమ్మవారి ఆల‌యంలో ప్ర‌ధాన ర‌హ‌దారి వైపు ఉన్న ప్ర‌హ‌రీగోడ‌తో పాటు ముందు ఉన్న సింహ‌ద్వారాన్ని కూల్చివేశారు. కాగా ఈ ఘ‌ట‌న పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రోడ్డు ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల‌ ఆరాధ్యదైవం పాత‌ప‌ట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌డం దారుణమ‌ని నారాలోకేష్ ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లో అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ధ్వంసం, ఒక‌టేమిటి రెండున్న‌రేళ్ల పాల‌న‌లో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసిందని వ్యాఖ్యానించారు.

దేవుళ్ల‌కి తీర‌ని అప‌చారం త‌ల‌పెట్టారంటూ మండిపడ్డారు. రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల పేరుతో అదే పాత‌ప‌ట్నంలో ఆంజ‌నేయ‌స్వామి, వినాయ‌కగుడిలో విగ్ర‌హాలు త‌ర‌లించుకుంటామ‌ని వేడుకున్నా స‌మ‌యం ఇవ్వ‌కుండా బుల్డోజ‌ర్ల‌తో కూల్చేయ‌డం ప్ర‌భుత్వపెద్ద‌లు హిందువుల ఆల‌యాల ప‌ట్ల ఎంత నిర్ద‌య‌గా ఉన్నారో అర్థం అవుతోందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేకి ఆల‌యాల ధ్వంసం పై స‌మాచారం ఇచ్చినా ప‌ట్టించుకోలేద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారంటే ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసి చేసిన విధ్వంస‌మేనంటూ నారా లోకేష్ మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news