రాజేంద్ర నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు నారాయణ విద్యార్థుల దుర్మరణం

-

హైదరాబాద్‌లోని అరాంఘర్ చౌరస్తా సమీపంలో పిల్లర్ నం.221వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నారాయణ కళాశాల విద్యార్థులు దుర్మరణం చెందారు. టాటా సఫారీ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు తరుణ్‌, ఉదయ్‌గా గుర్తించారు. అయితే మాదాపూర్‌లోని నారాయణ క్యాంపస్‌కు చెందిన తొమ్మిది విద్యార్థులు అనుమతి లేకుండానే పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. స్నేహితుడు బర్త్‌డే పార్టీ కోసం గోడ దూకి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news