యూనివర్సీటీల ర్యాంకులను ప్రకటించిన కేంద్రం..దూసుకొచ్చిన తెలంగాణ !

-

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్(ఎన్ ఐ ఆర్ ఎఫ్) 2021 నివేదిక విడుదలైంది. ఆన్లైన్ వేదికగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిపోర్ట్ విడుదల చేశారు. ఆరు అంశాల ఆధారంగా దేశం లోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు. ఇంజనీరింగ్, మెడికల్,డెంటల్ సహా మొత్తం పదకొండు కేటగిరీల్లో ర్యాంకులని ప్రకటించారు.

ఓవరాల్ కేటగిరీలో మొదటి ర్యాంక్ ఐఐటీ మద్రాస్ సాధించిగా… రెండో ర్యాంక్ ఐ ఐ ఎస్ సీ బెంగళూరు సాధించింది. యూనివర్సిటీల కేటగిరీ లో మొదటి స్థానాన్ని ఐ ఐ ఎస్ సీ బెంగళూరు మొదటి స్థానం సాధించగా హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ 9 వ స్థానాన్ని సాధించింది. ఇంజనీరింగ్ విభాగం లో ఐ ఐ టీ మద్రాస్ మొదటి స్థానం సాధించగా  ఐ ఐ టీ, హైదరాబాద్ 7 వ స్థానం సాధించింది. మెడికల్ కేటగిరీలో ఢిల్లీ ఎయింస్ మొదటి స్థానం సాధించగా… లా కేటగిరీలో హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్సిటీ 3 వ స్థానాన్ని కైవసం చేసుకొంది.

Read more RELATED
Recommended to you

Latest news