ఓమిక్రాన్ : పెళ్లికి హాజ‌రైన 9 మంది ఓమిక్రాన్ రోగులు

-

ఆదివారం రోజు రాజ‌స్థాన్ లోని జైపూర్ లో ఒకే కుటుంబం లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ తొమ్మిది మంది ఓమిక్రాన్ రోగులను అధికారులు ట్రెస్ చేశారు. వీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది ని క‌లిసారు అనే దాని పై విచార‌ణ చేస్తున్నారు. దీని లో అధికారులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. ఈ తొమ్మిది మంది లో న‌లుగురు సౌత్ ఆఫ్రిక నుంచి న‌వంబ‌ర్ 25న‌ వ‌చ్చారు. ఈ న‌లుగురికి మాత్ర‌మే ఓమిక్రాన్ వేరియంట్ సోకింది.

అయితే వీరు నవంబ‌ర్ 28న ఒక్క పెళ్లి వేడుక లో పాల్గొన్నారు. పెళ్లి త‌ర్వాత ఆ కుటుంబం నుంచి ఒక‌త‌ను టెస్ట్ చేసుకోగా.. కరోనా పాజిటివ్ వ‌చ్చింది. అదే ఓమిక్రాన్ గా తెలిసింది. ఆ కుటుంబం మొత్తం టెస్టులు చేయ‌గా.. మొత్తం 9 మంది కి ఓమిక్రాన్ అని తెలింది. అయితే ఈ పెళ్లి వేడుక కు దాదాపు 100 మంది కి పై గా వ‌చ్చార‌ని అధికారులు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం అందులో 34 మంది శాంపుల్స్ ను ప‌రీక్షించారు. మిగిలిన వారి కి కూడా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news