తండ్రి, తమ్ముడిని చంపి, ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టిన 15 ఏళ్ల బాలిక..!

-

తండ్రిని, తమ్ముడిని చంపి శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టింది 15 ఏళ్ల బాలిక. అయితే.. ఈ కేసులో రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రః జబల్పూర్ లో 15 ఏళ్ల బాలిక స్థానికంగా నివ‌సిస్తున్న ముకుల్ సింగ్‌ (19)తో ప్రేమ‌లో పడింది.

A 15-year-old girl killed her father and younger brother, cut them into pieces and put them in the fridge

ఇంట్లో వారికి విష‌యం తెలిసి వారు మంద‌లించ‌డంతో వీరిద్ద‌రూ ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో.. మైన‌ర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను అరెస్ట్ చేసారు. త‌న ప్రియుడిని జైల్లో పెట్టించి.. తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో, ముకుల్ విడుదలైన అనంతరం వారు ఇద్దరూ ఇంటికి వెళ్లి.. తండ్రిని, సోదరుడిని చంపి.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది. కాగా రెండు నెలల తర్వాత బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version