శిర్డీ సాయి భక్తులకు గుడ్​న్యూస్​.. క్యూలో ఏసీ సౌకర్యం

-

శిర్డీకి వచ్చే భక్తులకు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ గుడ్ న్యూస్ చెప్పింది. సాయి దర్శనం కోసం భక్తులు వేచి చూసే మార్గంలో ఏసీ సదుపాయం కల్పించనున్నట్లు ట్రస్ట్‌ వెల్లడించింది రూ.109 కోట్ల వ్యయంతో భారీ కాంప్లెక్స్‌ నిర్మాణం సహా భక్తులకు ఉపయోగపడేలా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. సౌకర్యవంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు సాయి దర్శనం చేసుకొనేలా ఈ ఏర్పాట్లు ఉంటాయని పేర్కొంది.

“శిర్డీలోని ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సాయి దర్శన కాంప్లెక్స్ నిర్మిస్తాం. రెండస్తుల్లో ఈ భవనం ఉంటుంది. ఈ దర్శన కాంప్లెక్స్​లో 12 ఏసీ గదులు ఉంటాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. భద్రత కోసం 200 సీసీటీవీ కెమెరాలు అమర్చుతాం. మొత్తం రూ.109.50 కోట్లతో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తిచేస్తాం.”-రాహుల్ జాదవ్, సాయి సంస్థాన్ ట్రస్ట్ డిప్యూటీ ఎగ్జిగ్యూటివ్ అధికారి

Read more RELATED
Recommended to you

Latest news