జూన్ 28 నుండి అమర్నాధ్ యాత్ర ప్రారంభం…!

-

అమర్ నాధ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది జూన్ 28 తో ముగుస్తుంది. ఈ జూన్ జూలై నెలల్లో ఇది ఉంటుంది. అనంత నాగ్ జిల్లా పహల్గామ్ రూట్ లో ఇది 36 కిలో మీటర్లు. బల్తాల్ రూట్ గందేర్బల్ జిల్లా నుంచి అయితే 14 కిలో మీటర్లు. సీనియర్ ఆర్మీ ఆఫీసర్ మంగళవారం నాడు దక్షిణ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితి మెరుగు పడిందని అన్నారు.

అలానే మెరుగైన పరికరాలు కూడా ఉన్నాయని అన్నారు. అమర్ నాధ్ యాత్రని ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉంది అని అన్నారు. దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ తో సహా పర్యాటకులు అధికంగా రావడం అభివృద్ధి చెందిందని తెలుస్తోందన్నారు.

పర్యాటకులు మరియు అమర్ నాధ్ యాత్రలకి వచ్చే యాత్రికుల దృష్టి లో పెట్టుకుని సెక్యూరిటీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా మొన్న మొన్నటి దాకా ప్రయాణికుల్ని అనుమతించలేదు. అయితే ఏది ఏమైనా ఈసారి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని, సెక్యూరిటీని కూడా టైట్ గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news