పౌరసత్వం చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

-

పౌరసత్వం చట్టం CAA పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎకానమిక్ టైమ్ నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పౌరసత్వం చట్టం అమలులోకి తీసుకొస్తామని ప్రకటించారు. చట్టం అమలుకు ముందు నిబంధనలు జారీ చేస్తామని తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ పరంగా బాగుంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పొత్తులపై స్పందించారు అమిత్ షా.

ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొంత మంది బయటికి వెళ్లిపోవచ్చు. పొత్తు ధర్మాన్ని మేము ఎప్పుడూ ఉల్లంఘించలేదు అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ సిద్దాంతాలూ ఎప్పుడ మారలేదు అని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. 

Read more RELATED
Recommended to you

Latest news