Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్.. కొన్న ప్లాట్ ఎన్ని కోట్లంటే?

-

అయోధ్య రామ్మందిర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు అయోధ్యలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరయు నది ఘాట్‌ వద్ద హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అర్చకులు సరయు నదికి హారతి ఇచ్చారు. ఈ వేడుకను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Amitabh Bachchan buys land in Ayodhya for 1million

ఘాట్‌ వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబిఎల్) వద్ద బిగ్ బీ ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫ్లాట్ విలువ ఎంత, సైజు ఎంత సంగతి మాత్రం వెల్లడించలేదు. కానీ ఇండస్ట్రీవర్గాల వారు చెబుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్త ప్రకారం…. ఫ్లాట్ విస్తీర్ణం సుమారు పదివేల చదరపు అడుగులు ఉంటుందని, దాని విలువ రూ. 14.5 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news