ఆదిత్య L1 లాంచ్ పై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్..!

-

ఆదిత్య L1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య L1 మిషన్ ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్ తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.  పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చిందని.. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుడి దగ్గరగా వెళ్లి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటలను ఇస్రో చెరిపేయనుంది. మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం అనే సందేశాన్ని ఇస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎల్1 మిషన్ కి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు చంద్రయాన్ 3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ అభినందను తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news