Anand Mahindra: మరో ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

-

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు మహీంద్ర సంస్థ సీఈఓ ఆనంద్ మహీంద్రా. వివిధ సంఘటనలపై స్పందిస్తుంటారు. గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమిళనాడు ఇడ్లీ అమ్మను ప్రశంసించారు. ఇదే విధంగా ఆమెకు ఓ ఇంటిని కట్టించి అందరి మనసులను గెలుచుకున్నారు. ఎప్పటికప్పుడు తన చూపును ఆకర్షించే విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఫన్నీగా జవాబు ఇచ్చి అందరిని ఆకర్షించారు. ‘ మీరు టైం ఎలా మ్యానెజ్మెంట్ చేసుకుంటున్నారని ’ నెటిజెన్ ప్రశ్నించారు. దీనికి ఆనంద్ మహీంద్రా.. గత కొంత కాలంగా టైం నన్ను మ్యానెజ్ చేస్తుందని జవాబు ఇచ్చారు. ఇటీవల థామస్ కప్ గెలిచిన సందర్భంలో కూడా క్రీడాకారులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా సదరు క్రీడాకారుడు నేను మహీంద్ర ఎస్ యూ వీ ని 7oo బుక్ చేశాను నాకు త్వరగా డెలవరీ చేయాలని కోరాడు. దీనికి మహీంద్రా నేను కూడా నా భార్య కోసం ఎస్ యూ వీ 7ooను బుక్ చేశానని.. నేను కూడా కార్ కోసం క్యూలో ఉన్నానని బదులిచ్చాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. తమిళనాడులోని ఓ ఏనుగు బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి ట్వీట్ చేశాడు. ‘‘ ఈ క్లిప్ తిరువానైకావల్ ఆలయం (తమిళనాడు) అఖిల ఏనుగు పుట్టినరోజు వేడుక నుండి వచ్చినదని నాకు తెలిసిందని.. నేను ఏనుగు విలక్షణమైన దేశిని ప్రేమిస్తున్నాను, తలను పక్కకి ఆడించాను. ఏనుగు ఆనందం అంటువ్యాధి… మీరు ఎప్పుడైనా ఉత్సాహంగా ఉండాలంటే చూడవలసిన మంచి క్లిప్…’’  అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు నెటిజెన్ల నుంచి కూడా అంతే స్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news