టాప్ కమాండర్ ని కాల్చి చంపేసిన ఆర్మీ…!

-

కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ ని బలగాలు కాల్చి చంపాయి. సిఆర్‌పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం సోమవారం ఉదయం బారాముల్లా క్రెరీలో దాడి చేసిన తరువాత జరిగిన కాల్పుల్లో ఎల్‌ఇటి కమాండర్ సజ్జాద్ అకా హైదర్ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాద దాడిలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాడి తరువాత, భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సిఆర్‌పిఎఫ్, జెఅండ్‌కె పోలీసుల సంయుక్త బృందం సజ్జాద్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి కాల్చి చంపింది. మరో ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news