గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ కోసం జరుగుతున్న సన్నాహకాలు పర్యవేక్షించడానికి అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం పోరుబందర్ చేరుకున్నారు. అక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను పోరుబందర్ లో కొన్ని పార్టీ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చానని, అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కచ్ లో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చానని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గత స్థానిక ఎన్నికల్లో తాము కేవలం పన్నెండు రోజులు మాత్రమే కష్టపడ్డామని, కానీ మంచి ఫలితాలు రాబట్టామని వివరించారు. తమ పార్టీ నుంచి కార్పొరేటర్లు గెలిచారని గుర్తు చేశారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, మైనారిటీ, దళితుల అభ్యున్నతి వంటి కీలక అంశాలు అజెండాగా తాము ఎన్నికల బరిలోకి దిగుతున్నామని వివరించారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు అనేదానిపై సమాధానం ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news