బైక్ కొనేందుకు రూ. 2.6 లక్షల రూపాయి నాణేలను సేకరించాడు .. లెక్కించేందుకే 10 గంటలు పట్టింది…ఎక్కడో తెలుసా…?

-

కలలు నెరవేర్చుకునేందుకు కొంతమంది ఎంతటి కష్టాలైన ఎదుర్కొంటారు. తమ కలను నెరవేర్చకుంటారు. ఇలాంటి ఓ యువకుడి కథే ఇది. తాను కలల బైక్ కొనేందుకు ఆ యువకుడు చేసిన పనిని చూస్తే షాక్ తినాల్సిందే. తమిళనాడు సేలం కు చెందిన ఓ యువకుడు  ఏకంగా మూడేళ్ల పాటు ఒక రూపాయి నాణేలు సేకరించాడు.

ఏకంగా 2.6 లక్షల రూపాయి నాణేలను సేకరించి తన కలల బైక్ ను సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త దేశంలోనే తెగ వైరల్ అవుతోంది. సేలం అమ్మపే గాంధీ మైదాన్ లో నివసించే భూపతి గత వారం బజాజ్ డీలర్ షిప్ బైక్ సొంత చేసుకునేందు రూ. 2.6 లక్షల విలువగలిగిన రూపాయి నాణేలను తీసుకెళ్లాడు. మూడు సంవత్సరాలు ఇలా రూపాయి నాణేలను సేకరించి బైక్ కొనుక్కున్నాడు. బజాజ్ డామినార్ 400సీసీ బైక్ ను కొనుగోలు చేశాడు. 

ఇటీవల శనివారం తన రూ. 2.6 లక్షల నాణేలను గోనె సంచుల్లో మూటగా చేసి ఓ మిని వ్యాన్ లో షోరూంకు తీసుకెళ్లాడు. భూపతి అతని నలుగురు స్నేహితులతో పాటు ఐదుగురు షోరూం సిబ్బంది ఈ నాణేలను లెక్కిండానికి ఏకంగా 10 గంటల సమయం పట్టింది. మొదటగా  బీసీఏ గ్రాడ్యుయేట్ అయిన 29 ఏళ్ల భూపతి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని నాణేలుగా మారుస్తున్నాడు. అయితే మొదటగా భూపతి నుంచి నాణేలు సేకరించడానికి ఇష్టపడలేదని… కానీ భూపతిని నిరాశపరచకూడదని స్వీకరించాం అని షోరూం మహావిక్రాంత్ వెల్లడించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news