శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బిజెపి బంపర్ ఆఫర్

-

మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు వేడెక్కుతున్నాయి.శివసేన పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బిజెపి పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంపు వేశారు.

తాజాగా ఈ హోటల్ కు అస్సాం ముఖ్యమంత్రి అశోక్ సింఘాల్ చేరుకొని, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి ముందు భారీ ఆఫర్ ఉంచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయ మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ శివసేన ఎంపీలు వస్తే కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news