బ్రేకింగ్: సరిహద్దుల్లో చెలరేగిపోతున్న పాక్ ఆర్మీ

-

గత నెల రోజుల నుంచి పాకిస్తాన్ ఎక్కడో ఒక చోట సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా మరోసారి సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. జమ్మూ & కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని మాంకోట్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనికి భారత సైన్యం అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. తేలికపాటి ఆయుధాలు మోర్టార్ లతో పాకిస్తాన్ కాల్పులకు దిగింది.

సాధారణ పౌరులు జవాన్లె లక్ష్యంగా పాక్ ఈ కాల్పులు జరుపుతుంది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. కుల్గాంలోని సిఘన్‌పూర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొనగా ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ కాల్చి చంపింది అని తెలుస్తుంది. ఉగ్రవాదులు ఉన్నారు అనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ ఈ కాల్పులకు దిగింది.

Read more RELATED
Recommended to you

Latest news