ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు.. రూ.25 కోట్లు లంచం అడిగిన వాంఖడే!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు గతేడాది డ్రగ్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేతో పాటు మరో నలుగురు రూ.25కోట్లు లంచం డిమాండ్‌ చేశారన్న అభియోగాలతో వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ క్రమంలో శుక్రవారం సీబీఐ అధికారులు ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పుర్‌లలో వాంఖడేకు చెందిన 29 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. వాంఖడే జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 అక్టోబరులో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాంఖడే లంచం కింద అడ్వాన్సుగా రూ.50లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. మరోవైపు డ్రగ్స్‌ పార్టీ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్‌సీబీ ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news