వామ్మో వాట్సాప్ వాడొద్దు..మోడీ మామ వార్నింగ్

-

ప్ర‌భుత్వ ఉద్యోగులారా! ఇక‌పై మీరు వాట్సాప్ వాడొద్దు.. మీ మీ డేటాను టెలిగ్రామ్ యాప్ ద్వారా సెండ్ చేయ‌వ‌ద్దు..ముఖ్యంగా ఆఫీసుకు సంబంధించి ఏ డేటా అయినా ఈ రెండు యాప్స్ కోసం కేటాయించ‌వ‌ద్దు. ఇవి ఎంత‌మాత్రం భ‌ద్ర‌తాప‌రంగా హామీ ఇవ్వ‌ని సంస్థ‌లు.ఇప్ప‌టికే ద‌ఫ‌ద‌ఫాలుగా కేంద్రం ఈ సంస్థ‌ల‌ను హెచ్చ‌రించినా కూడా ఫ‌లితం లేక‌పోయింది.ఆఖ‌రికి స్వీయ నియంత్రిత చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.వీటి ప్ర‌కారం ఆ రెండు యాప్స్ ను వాడకూడ‌దని, అస్స‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేసే వాళ్లెవ్వ‌ర‌యినా స‌రే ఆఫీసులో రూపొందించిన ఇ అప్లికేష‌న్స్ ను మాత్ర‌మే వాడితే మేలు అని విన్న‌విస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ దేశీయ ప‌రిజ్ఞానంతో ప‌నిచేసే యాప్స్ ను మాత్ర‌మే వీలున్నంత వ‌ర‌కూ డేటా మార్పిడి కి కానీ బ‌దిలీకి కానీ వాడితే ప్ర‌యోజ‌నం బాగుంటుంద‌ని హ్యాకింగ్ కు పెద్ద‌గా ఆస్కారం ఉండ‌ద‌ని, కొద్ది పాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే డేటా సుర‌క్షితంగా ఉంటుంద‌ని కేంద్రం అంటోంది.

అంత‌ర్గ‌త భద్ర‌తా కార‌ణాల రీత్యా కేంద్రం కొన్ని కీలక నిర్ణ‌యాలు తీసుకుంది.ఇందులో భాగంగా ప్ర‌భుత్వ అధికారులు కానీ ఇత‌ర సిబ్బంది కానీ త‌మ త‌మ స‌మావేశాల‌కు స్మార్ట్ ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ తీసుకుని రాకూడ‌ద‌ని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వాట్సాప్, టెలిగ్రాఫ్ వంటి యాప్స్ వాడకాన్ని వ‌ద్ద‌నుకోవాల‌ని, డేటా మార్పిడికి ఇవి సుర‌క్షితం కాద‌ని తేల్చేసింది. వీటి స్థానంలో దేశీయ సంస్థ‌లు డెవ‌ల‌ప్ చేసిన యాప్స్ వాడాల‌ని, అదేవిధంగా దేశీయంగా త‌యారు చేసిన ఇ ఆఫీస్ అప్లికేష‌న్స్ ను మాత్ర‌మే వాడుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీఇప్ప‌టిదాకా కేంద్రం చెబుతున్న ఏ ఆదేశాల‌ను పాటించిన దాఖ‌లాలు లేవు.దీంతో డేటా లీకేజీల‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ద‌శలో భ‌ద్ర‌తా సంస్థ‌ల హెచ్చరికల నేప‌థ్యంలో ఇ – ఆఫీసు నిర్వ‌హించే వారెవ్వ‌ర‌యినా స‌రే త‌మ డేటా ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ కు ఆ రెండు యాప్స్ ను వాడొద్ద‌ని ప‌దే ప‌దే కేంద్రం చెబుతుంది.

whatsappముఖ్యంగా డేటా హ్యాకింగ్ అన్న‌ది ఇటీవ‌ల విరివిగా జ‌రిగిపోతోంది.అదేవిధంగా దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల లీకేజీ కూడా సులువుగానే సాగిపోతుంద‌న్న ఆరోప‌ణ‌లు ఈ యాప్స్ వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించ‌డం అన్న‌ది సాధ్యం కాదు క‌నుక ఉద్యోగుల వ‌ర‌కూ నిషేధాన్ని కొన‌సాగించాల‌ని, నియంత్ర‌ణ లేక‌పోతే దేశానికే పెను ప్ర‌మాదం అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వీటితో పాటు వీడియో కాన్ఫ‌రెన్సుల‌కు ఉపయోగిస్తున్న జూమ్ కానీ గూగుల్ మీట్ యాప్స్ ను కానీ అస్స‌లు వాడొద్ద‌ని అంటోంది. వీటి స్థానంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIS) డెవలప్ చేసిన యాప్స్ నే వాడాల‌ని ప‌దే ప‌దే విన్న‌విస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news