జీ-20 సమ్మిట్ పై కాంగ్రెస్ నేత ప్రశంసలు

-

జి -20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్. జి-20 సదస్సు సక్సెస్ కావడం మన దేశానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. అలాగే ఢిల్లీ డిక్లరేషన్ పై అన్ని దేశాలను ఏకాభిప్రాయానికి తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు.

అనేక అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో భారత్ అతిపెద్ద విజయం సాధించిందని పేర్కొన్నారు. సదస్సు నిర్వహణ బాధ్యతలను అమితాబ్ కాంత్ అద్భుతంగా నిర్వర్తించారని అభినందించారు. ఉక్రెయిన్ – రష్యా సంక్షోభం విషయంలో ఈ డిక్లరేషన్ లో భారత్ పేర్కొన్న “షేరా” కు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news