4 నెలల తర్వాత భారత్​లో అత్యధిక కరోనా కేసులు.. మళ్లీ మాస్కు పెట్టాల్సిందేనా..?

-

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది. అని.. అనుకునేలోపే.. మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. నాలుగు నెలల తరువాత భారత్​లో అధిక కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు.. 754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో కర్ణాటక ఒకరు మృతి చెందారు.

మొత్తంగా భారత్​లో 4,633 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 నవంబర్​లో అత్యధికంగా 734 కొవిడ్​ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తరువాత బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన కేసులో అత్యధికమని తెలిపింది.

కొవిడ్​ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది మరణించారు. భారత్​లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య.. 4,46,92,710. ప్రస్తుతం 0.01 శాతం కొవిడ్ యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొవిడ్​ కేసుల రికవరీ శాతం 98.80గా ఉంది. కొవిడ్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి పెరిగింది. మృతి చెందిన వారి శాతం 1.19గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news