భారత్​లో 24 గంటల్లో 3,611 కొత్త కేసులు

-

భారత్​లో కరోనా వైరస్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కేసులు 3వేలకు పైగా కొనసాగుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యం వహించకూడదని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెప్పింది. కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి మొత్తం పారదోలాలని పిలుపునిచ్చింది.

దేశంలో వరుసగా మూడో రోజు 3 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 1,73,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,611 కొత్త కేసులు బయటపడ్డాయి. మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,64,289కి చేరింది. ప్రస్తుతం దేశంలో 33,232 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 4,43,99,415 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,642కి ఎగబాకింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.07 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news