భారత్‌కు లాభం చేసిన కరోనా మహమ్మారి..!

-

ప్రతి సంక్షోభం గొప్ప అవకాశాలను కలిగి ఉంటుంది,కల్పిస్తుంది..కొత్త అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకు వస్తుంది..కరోనా మహమ్మారి అందుకు భిన్నంగా ఏం లేదు..కరోనా వైరస్‌ అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారి ఆర్థిక వ్యవస్థలను తిరిగి అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను కల్పింది..ఆర్థిక వనరుల కొసం ఇతర దేశాలపై ఆధారపడకుండా చేసింది.కోవిడ్ ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసింది..కరోనా నివారణ చర్యలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రపంచ దేశాల పారిశ్రామిక రంగాన్ని అస్తవ్యస్తం చేసింది..ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది..నిరుద్యోగాన్ని పెంచింది..అయితే భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా వైరస్‌ లాభం చేసిందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు..కరోనా మహమ్మారి భారత్ వంటి దేశాలకు వాటి ఆర్థిక వ్యవస్థలను తిరిగి అభివృద్ధి చెందడానికి..స్వయం సమృద్ధిని సాధించడానికి..విదేశీల నుంచి వచ్చే సహయంపై ఆధారపడకుండా ఉండే అవకాశాన్ని కరోనా కల్పించింది.కరోనా వైరస్‌ ప్రజారోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోందని..ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించిందని..2020 లో ప్రపంచ జిడిపి 4.4% తగ్గిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది..అయితే, వింతగా అనిపించినా, ప్రస్తుత సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఒక మార్గాన్ని అందించగలదని అంచనవేసింది..అంతే కాకుండా, ధనిక దేశాలు దేశీయ పాండమిక్ రికవరీలపై దృష్టి సారించడంతో వాటి అభివృద్ధి క్షీణించింది..ఇది 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే 60శాతం ఎక్కువ..కరోనా వైరస్‌ ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్వావలంబన కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..కొత్త స్టార్టర్స్ కంపెనీలు వస్తాయి..మహమ్మారి సమయంలో తూర్పు ఆసియాలో అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం..పాశ్చాత్య దేశాల కంటే తగ్గిందని ప్రపంచ వాణిజ్య సంస్థ తెలిపింది..దీనికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, అధిక విలువలతో కూడిన వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు సాధారణంగా కరోనా కారణంగా ఎక్కువ నష్టపోతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు చిన్న పరిశ్రమలు, తక్కువ విలువతో కూడిన తయారీపై ఆధారపడటంతో తక్కువ నష్టం కలిగించింది..

ఇ-కామర్స్ ను గణనీయంగా పెంచడం ద్వారా పోస్ట్-పాండమిక్ రికవరీలో డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తుంది..ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుడులను మంచి పోటీని సూచిస్తుంది. ఆగస్టు నాటికి బంగ్లాదేశ్ యొక్క ఇ-కామర్స్ రంగం సంవత్సరానికి 26% పెరిగింది మరియు ఇతర దక్షిణాసియా దేశాలు కూడా ఇదే విధమైన ధోరణిని చూపుతున్నాయి..ఆరోగ్యం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలు మరింతగా తెలుసుకోవడంతో ఆరోగ్య-సంరక్షణ మరియు ఔషధ రంగాలు పాండమిక్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక వనరుల లోటు పూడ్చడానికి దేశీయ వనరులను సమీకరించుకుంటాయి.. ప్రత్యేకించి వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి వారి పన్ను విధానాల్లో మార్పులు చేసుకుంటాయి..సోంతంగా ఆధాయ వనరులను సమకూర్చుకుంటాయి.దీంతో దేశాలు స్వయం సమృద్ధిని సాధిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news