BREAKING : ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఐదుగురు సజీవదహనం

-

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. దానివల్లే మంటలు వ్యాపించి ఐదుగురు సజీవ దహనం అయ్యారని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో లక్నోలోని ఓ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన సమీపంలోనే రెండు సిలిండర్లు ఉండటంతో అవి పెద్ద ఎత్తున శబ్ధాలు చేస్తూ పేలాయి. దీంతో ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news