కేరళకు వస్తే ఆత్మాహుతి దాడి చేస్తాం.. మోదీకి బెదిరింపు లేఖ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. మోదీ.. కేరళ పర్యటనకు వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఓ బెదిరింపు లేఖ విడుదలైంది. ఎర్నాకులం వాసి జోసెఫ్ జాన్ నడుముత్తమిల్ పేరుతో.. కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఈ లేఖ వచ్చింది. ఏప్రిల్​ 24న కేరళలో రెండు రోజుల ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో.. ఈ లేఖ బయటకు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

ఈ లేఖతో రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం ఈ లేఖ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్య అధికారికి.. బీజేపీ నాయకులు అందించారని వెల్లడించారు. ఇవాళ ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏప్రిల్​ 24 నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రధాన మంత్రి పర్యటిస్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. బీజేపీ నేతృత్వంలోని యువజన సంఘాలు నిర్వహించే ‘యువం’ అనే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news