హైద‌రాబాద్ చేరుకున్న దిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు

-

తెలంగాణ సీఎం కేసీఆర్​ను కలిసేందుకు దిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లు హైద‌రాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డి నుంచి కాసేపట్లో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ భోజనం చేయ‌నున్నారు. కేజ్రీవాల్‌ వెంట దిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.

జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరుతున్న విషయం తెలిసిందే. ఇరువురు సీఎంల భేటీ సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్‌-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు తదితర కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news