యూపీలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

-

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్డుపై వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ కస్ గంజ్ వద్ద చెరువులో పడిపోవడంతో 15 మంది మరణించారు. మరికొందరూ గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారని.. యాత్రికులందరూ హరిద్వార్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్టు అధికార యంత్రాంగం నిర్థారించింది. పాటియాలీలోని సీహెచ్ సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిలలు మరణించారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news