జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన జనం

-

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా.. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడక్కడా వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న ఫోనిక్స్ భవనంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

 

ఉన్నట్టుండి నాలుగో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫీసు యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణాలు మాత్రం ఇంకా తెలియదు. మంటలు ఎలా సంభవించాయనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు  మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news