ఐసియులో అగ్ని ప్రమాదం, 8 మంది కరోనా రోగులు మృతి

-

గుజరాత్ రాష్ట్రంలోని ఒక ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్రమాదంలో వారు అగ్నికి ఆహుతి అయ్యారు. అహ్మదాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున నవరంగపురా ప్రాంతంలోని శ్రేయా ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ఈ మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది.8 killed as massive fire breaks out at COVID-19 hospital in Gujarat's Ahmedabad

3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఐసియు లో చికిత్స తీసుకుంటున్న 8 మంది రోగులు కనీసం తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా కాలి బూడిద అయ్యారు. ఆస్పత్రి సిబ్బంది అగ్ని మాపక యంత్రాలకు సమాచారం ఇచ్చినా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇక మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఉన్న వారు కరోనా రోగులు కావడంతో వారిని కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news