వైరల్ వీడియో: రాముడికి పూజలు నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

-

కోట్ల మంది హిందువుల ఆకాంక్ష నిన్న నెరవేరింది. కోట్లాది మంది హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిణామం నిన్న వచ్చింది. రామాలయ నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్యలో శంకుస్థాపన జరిగింది. దీనితో దేశం మొత్తం కూడా భక్తి పారవాశంలో మునిగిపోయింది అనే మాట వాస్తవం. హిందువులు అందరూ కూడా రాముడికి పూజలు నిర్వహించారు.

అయితే ముస్లిం లు కూడా రాముడికి పూజలు నిర్వహించారు. తాజాగా ఫేస్బుక్ లో నజీం అన్సారి అనే ముస్లిం మహిళ ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియో లో… ముస్లిం మహిళలు అందరూ కూడా రాముడికి పూజలు నిర్వహిస్తున్నారు. హారతి ఇస్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అంటూ వారు సీతా రాములతో పాటుగా హనుమంతుడుని కొలుస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Posted by Nazneen Ansari on Wednesday, 5 August 2020

Read more RELATED
Recommended to you

Latest news