అటల్‌ సేతుపై తొలి ప్రమాదం.. బోల్తాపడ్డ కారు

-

ముంబయిలో నూతనంగా నిర్మించిన ‘అటల్‌ సేతు’పై తొలి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళ్తున్న కారు అటల్‌ సేతుపైకి చేరుకోగానే ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని స్థానికులు అన్నారు. అటల్‌ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news