రైల్వే స్టేషన్​కు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

-

 ఝార్ఖండ్​లోని పలామూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగరుంటారీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జాతీయ రహదారి 75పై ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాఢ్​వాలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఇదే పోలీస్​స్టేషన్ పరిధిలోని సీరియా తోమర్​ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

మృతులను బిమ్లేశ్ కుమార్ కనౌజియా(42), అరుణ్ భుయాన్(30), బికేశ్ భుయాన్(20), రాజ కుమార్(21), రాజ్​కుమార్ భుయాన్(53)గా పోలీసులు గుర్తించారు. వేరే రాష్ట్రంలో పని నిమిత్తం వీరంతా శుక్రవారం ఉదయం శక్తిపంజ్​ ఎక్స్​ప్రెస్​లో వెళ్లాల్సి ఉందని.. ఈ క్రమంలో రైల్వే స్టేషన్​కు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news