999కి చేరిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల సంఖ్య

-

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు నిన్నటితో 999కి చేరాయి. దరఖాస్తులకు ఎటువంటి రుసుము లేనందున ఒక్కొక అభ్యర్థి 3, 4 అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులకు 10వ తేదీ వరకు గడువు ఉండడం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే… ఎన్నికల కమిటీ ల పై బీజేపీ కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగానే.. ఇవాళ కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, ఇంద్ర సేనా రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో, ఛార్జ్ షీట్ , సభలు, తదితర కమిటీలు వేయనుంది బీజేపీ పార్టీ. అలాగే..ఇవాళ సాయంత్రం జరగనున్న మీటింగ్ ఎజెండా పై కూడా చర్చించనున్నారు నేతలుకిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, ఇంద్ర సేనా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news