టెలికాం శాఖ పేరుతో కాల్స్‌ వస్తున్నాయా..? బీ కేర్ఫుల్..!

-

కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ విభాగం (డీఓటీ) మొబైల్‌ యూజర్ల కోసం శుక్రవారం రోజున ఓ అడ్వైజరీ జారీ చేసింది. తమ శాఖ పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని చెప్పింది. విదేశీ మొబైల్‌ నంబర్ల నుంచి నేరగాళ్లు వాట్సాప్‌ కాల్స్‌ చేసి.. మొబైల్‌ నంబరును నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఇవి కేంద్ర టెలి కమ్యూనికేషన్ విభాగం నుంచి వస్తున్నట్లు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి కాల్స్ను ప్రజలు నమ్మవద్దని తెలిపింది.

యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ కాల్స్‌ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దని, వెంటనే సంచార్‌ సాథీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. ఇదే వెబ్‌సైట్‌లోని ‘నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌’ అనే ఆప్షన్‌కు వెళ్లి యూజర్లు తమ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చని, అప్పటకీ ఈ సైబర్‌ మోసాల బారిన పడితే.. 1930 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి లేదా సైబర్‌ క్రైమ్‌ వెబ్‌సైట్‌లో రిపోర్ట్‌ చేయాలని సూచనలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news