నేటి ధరలు : బంగారం పైపైకి.. వెండి కిందకి..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన బంగారం ధర నిన్న స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇవాళ మాత్రం కాస్త పైకి కదిలింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం ధర కాస్త పెరగగా.. వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది.. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,550కు చేరింది. అదే సమయంలో రూ.240 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,090కి చేరుకుంది. పసిడి ధర పరుగులు పెడుతుంటే, వెండి ధర మాత్రం కాస్త ఊరటనిచ్చింది.

 

కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. దీంతో ధర రూ. 67,900కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 290 మేర పెరగడంతో రూ.54,600 చేరుకుంది. అలాగే రూ.250 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050కి చేరింది. ఇకపోతే అంతర్జాతీయంగా బంగారం ధర 1953 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 27.12 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news