బ్రేకింగ్; కరోనాతో కాంగ్రెస్ నేత మృతి…!

-

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అక్కడ ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. మరణాలు కూడా ఆ రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ఇక తాజాగా కరోనా వైరస్ కారణంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు బద్రుద్దీన్ షేక్ తుదిశ్వాస విడిచారని పార్టీ నాయకుడు శక్తిసింహ్ గోహిల్ తెలిపారు.

తనకు మాటలు రావడం లేదని ఆయన ట్వీట్ చేసారు. ఆయన తమకు బలమైన నాయకుడు అని పేర్కొన్నారు. మా గుజరాత్ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన సీనియర్ నాయకుడు, ఆయన యూత్ కాంగ్రెస్ తో ఉన్నప్పుడు 40 సంవత్సరాలుగా తనకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. అతను ప్రజల కోసం కష్టపడుతున్నారని… ఈ క్రమంలోనే కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారని వివరించారు

మరొక పోస్ట్‌లో, అహ్మదాబాద్‌లోని పేదలకు ఆయన సహాయం చేస్తున్నప్పుడు వ్యాధి సోకిందని ఆయన ట్వీట్ చేసారు. తన స్నేహితుడు బద్రు నిజమైన కొరోనా వారియర్ అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని పేద ప్రజలకు సహాయం చేస్తున్నప్పుడు ఆయనకు కరోనావైరస్ సోకిందన్నారు.గుజరాత్ కాంగ్రెస్ కి ఇది పెద్ద నష్టం అని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కాగా గుజరాత్ పై కేంద్ర౦ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news