హర్యాలో విషాదం.. స్మశానవాటిక గోడ కూలి నలుగురు దుర్మరణం

-

హర్యానాలో ఘోర విషాదం చోట చేసుకుంది. గురుగ్రామ్‌లో ఓ చోట కూర్చున్న నలుగురిని మృత్యువు ఊహించని రీతిలో కబలించింది. ఓ స్మశాన వాటిక చుట్టూ ఉన్న ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలడంతో మైనర్‌తో సహా నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మశాన వాటిక గోడ కూలగానే అక్కడ కూర్చున్న ఆరుగురి మీద శిథిలాలు పడ్డాయి. వెంటనే వాటిని స్థానికులు తొలగించడంతో ఇద్దరిని రక్షించగలిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఒక వ్యక్తికి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడటం ఆ దృశ్యాల్లో కనిపించింది. మృతులంతా స్మశాన వాటిక పక్కనే ఉన్న ఇంటి వారేనని పోలీసులు తెలిపారు. పాత గోడను సకాలంలో పునరుద్ధరించక పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్మశానవాటిక యాజమాన్య కమిటీ సభ్యుల మీద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news