తమిళనాడులో భారీ పేలుడు…!

-

తమిళనాడులోని కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌లో భారీ పేలుడు సంభవించింది. దీపావళి కోసం బాణాసంచా తయారు చేసే కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి కర్మాగారంలో పని చేస్తున్న ఐదుగురు మహిళలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు మహిళలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.

ఈ ఘటనలో పేలుడు దాటికి గిడ్డంగి పూర్తిగా ద్వంసం అయ్యిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కడలూరు ఎస్పీ విచారణకు ఆదేశించారని అధికారులు వివరించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ముందు అయుదుగురు ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news