జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం

-

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య రామ మందిరం. ఈ ఆలయం నిర్మాణ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇక యూపీలోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

Inauguration of Ayodhya Ram Temple on January 21
Inauguration of Ayodhya Ram Temple on January 21

వచ్చే ఎడాది జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు VHP కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా మత ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవానికి సన్నాహకంగా ఈ నెల 30 నుంచి అక్టోబర్ 15 వరకు గ్రామాల్లో శౌర్య యాత్రల నిర్వహణకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది మతపెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా రామ్​లల్లా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వేడుక జరుగుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news